logo

1992_93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా

గుడిపాల కమ్మతిమ్మయపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఆదివారము 1992_93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఉదయము పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు స్కూల్ ఆవరణంలో బ్యాండ్ మేళం తో పూర్వం విద్య నేర్పిన గురువులకు స్వాగతం పలుకుతూ చాలా
పండగ వాతావరణం లో ఈ కార్యక్రమం నిర్వహించారు పూర్వ విద్యార్థులకు చదువు నేర్పిన పూర్వం గురువులు రిటైర్డ్ డిప్యూటీ డిఈఓసుబ్రహ్మణ్యం గారు
అలాగే రిటైర్డ్ హెడ్మాస్టర్ నాయుడు బోడెబ్బ నాయుడు గారు గారు మరియు రిటైర్డ్ రంగయ్య నాయుడు గారు రిటైర్డ్వేణుగోపాల్ రెడ్డి గారు మరియు పద్మనాభం గారు పాల్గొని పూర్వ విద్యార్థులని ఆశీర్వదించారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు హెడ్మాస్టర్ భాను ప్రసాద్ రావు గారు మరియు గుడిపాల మండల ఎంఈఓ గారు హాసన్ మస్తాన్ గారు పాల్గొని వారు సందేశాన్ని కూడా అందజేశారు పూర్వం విద్యార్థుల చదువుకున్న స్కూల్ కి బహుమానంగా పూర్వ విద్యార్థుల సుమారు 40000 రూపాయలు విలువ చేసే మైక్ సెట్ ఆమ్ప్లి ప్లేయర్ స్పీకర్స్ గిఫ్టుగా హెడ్మాస్టర్ కి విద్యార్థులు అందజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ విద్యార్థులు పూర్వ గురువులకి కుటుంబ సభ్యులకి భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల కమిటీ చైర్మన్ ఓఎంపి మధుసూదన్ రావు ఈకార్యక్రమం లో భాగంగా వీరితో చదువుకున్న మాజి సైనిక ఉద్యోగులకి ప్రత్యేక సన్మానం చేసారు,తమతో చాటుకున్న వారు దేశ రక్షణ లో పనిచేయడం గర్వం గా ఉందని మధుసూదన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.చిట్టిబాబు వెంకటేశ్వర్లు విద్యాపతి నందగోపాల్ వీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారుమాజీ సైనికులు నందగోపాల్,విద్యాపతి,ఉప్పు రమేష్,మునిరాజులు,ఆదికేశవులు,రవిచంద్ర,రామయ్య,బాబు మునస్వామి తదితరులకు సన్మానము చేశారు

91
3225 views