logo

వీర్ జవాన్ మురళీ నాయక్ అమర్ రహే

అనంతపురం :ఉమ్మడి జిల్లా లోని గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన ఆర్మీ జవాన్ మూడవత్ మురళీ నాయక్ (25) పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం లో వీర మరణం పొందారు. శ్రీ రామ్ నాయక్. జ్యోతి భాయి ల ఎకైక సంతనం మూడవత్ మురళీ నాయక్ పదవతరగతి వరకు సోమందేపల్లి లో చదువు కున్నారు. ఇంటర్. డిగ్రీ అనంతపురం లో పూర్తి చేశారు. 2022 నవంబర్ లో ఆగ్నీవీర్ ద్వారా ఆర్మీ జవాన్ గా ఎంపిక కావడం జరిగింది. నాసీక్. పంజాబ్. తదితరప్రాంతం లో పని చెశారు. పాకిస్తాన్ తో యుద్ధం కారణంగా దేశం కోసం జమ్మూకాశ్మీర్ కు బదిలీ పై వెళ్ళారు. యుద్ధం లో వీర మరణం పొందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీర జవాన్ మురళీ నాయక్ తల్లి తండ్రులను ఫోన్ చేసి ఓదర్చారు. తమ ప్రభుత్వం అండగా వుంటుందని అన్నారు. పెనుగొండ ఎమ్మెల్యే చేనేత జౌళిశాఖ మాత్యులు సవిత గారు మురళీ నాయక్ తల్లి తండ్రులకు దైర్యం చొప్పరు వారికి ఐదు లక్షలరుపాయల చెక్కు ను అందచెశారు.
మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీర జవాన్ వారి తల్లి తండ్రులకు ఫోన్ చేసి ఓదార్చి దైర్యం చొప్పరు. వైస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ వారిని ఓదర్చారు. యుద్ధం లో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వలంచానలతో శనివారం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలేక్టర్. జిల్లా ఎస్పి తదితరులు తెలిపారు.

57
314 views