
1857 సిపాయిల తిరుగుబాటు నుండి 1947 ఆగష్టు15 దాకా ఎంతోమంది భారతదేశ స్వాతంత్ర్యానికి అనేక త్యాగాలు చేశారు.
1857 సిపాయిల తిరుగుబాటు నుండి 1947 ఆగష్టు15 దాకా ఎంతోమంది భారతదేశ స్వాతంత్ర్యానికి అనేక త్యాగాలు చేశారు. కొంతమంది తమ జీవితాలనే త్యాగం చేశారు.
భగత్ సింగ్, ఖుదీరామ్ బోస్, చంద్రశేఖర అజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ , కె.సి.పంత్, రాజేంద్రప్రసాద్ , లాంటి దేశభక్తులెందరో వారి వారి బుధ్దిని అనుసరించి, శక్తిని అనుసరించి,అప్పటి దేశ కాల పరిస్థితులను అనుసరించి,
స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా భారతమాతను సేవించారు.
వారి త్యాగాల ఫలంగా ఈనాడు మనం స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాము.
విశ్లేషణల పేరుతో అభూతకల్పనలు చేస్తూ
ఆ దేశభక్తులలో ఎవర్ని నిందించినా దేశద్రోహమే.
ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక,
ఇదంతా ఆర్.ఎస్.ఎస్, మోడీ చేయిస్తున్నారు అనే అపోహ ప్రజలలో కలిగించడానికి, తద్వారా వారి ఇమేజ్ దెబ్బతీయటానికి, కొంతమంది ఒక కుట్ర ప్రకారం ఈ నిందా ప్రచారానికి పూనుకుంటున్నారు.లేని లేఖలను, కథనాలను, సృష్టిస్తున్నారు.
ఆర్. ఎస్.ఎస్ , అణువణువునా దేశభక్తి కలిగి ఉన్న మహా సంస్థ. ఆ భావజాలాన్ని పుక్కిటపుచ్చుకున్న మహోన్నత వ్యక్తి మోడీ.
ప్రజలు అర్థం చేసుకొని, ఖర్గే వంటి కుహనా సెక్యులరిస్టుల ఆట కట్టించాలి.
ఇటలీ భక్తుల కుతంత్రాలు వెల్లడి చేయాలి.
- తూములూరి మధుసూదనరావు