logo

అమరులైన గ్రేహౌండ్స్ పోలీసుల మృతదేహాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు గారు....

తెలంగాణ - చతిస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మ్యాక్స్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్ గ్రేహౌండ్స్ కానిస్టేబులు మృతి చెందగా బుధవారం రోజున వారి మృతదేహాలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు పూలమాల వేసి నివాళులర్పించి అమరులైన పోలీస్ కుటుంబాలను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు...

ఇదే దాడిలో వరంగల్ నగరం పైడిపల్లి గ్రామానికి చెందిన గ్రేహౌండ్స్ర ఆర్ఎస్ఐ రణధీర్ తీవ్ర గాయాల పాలై హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అప్పటి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు...

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు...

12
84 views