logo

నేడు ఆంధ్రప్రదేశ్ లో NEET పరీక్ష

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) ఆదివారం జరగనుంది. రెండు షిఫ్టుల్లో.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మొదటి షిఫ్ట్‌, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండో షిప్టులో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణ నుంచి 72,507 మంది విద్యార్ధులు నీట్‌కు హాజరుకాబోతున్నారు. రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా.. 26 వేల మంది ఇక్కడే పరీక్ష రాయనున్నారు. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్‌ ప్రశ్నపత్రాలు లీకైన నేపఽథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు

1
13 views