గంజాయి మత్తలో స్నేహితుని హత్య కాకినాడ నగరంలో
కాకినాడ నగరంలోని ఆదివారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక రేచర్లపేట అనసూయమ్మ కాలనీలో గౌతమ్ (27) అనే డ్రైవర్ పై అతని స్నేహితులు రాళ్లతో దాడి చేయడంతో మృతి చెందాడు. మద్యానికి వారడిగిన డబ్బులు ఇవ్వనందుకు గంజాయి మత్తలో రాళ్లతో దాడి చేశారని స్థానికులు తెలిపారు.చికిత్స కోసం అతడిని జీజీహెచ్ కు తరలించగా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.