logo

దేశంలో అతి తక్కువ ధరలకు ఆహారం ఎక్కడ లభించునో మీకు తెలుసా?....అంకేశ్రపు. సాంబయ్య నీలగిరి వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్

దేశంలో అతి తక్కువ ధరలకు ఆహారం ఎక్కడ లభించునో మీకు తెలుసా?....అంకేశ్రపు. సాంబయ్య
నీలగిరి వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో కొత్తగూడెంకు చెందిన విశ్రాంతి ఉద్యోగి అంకేశ్రపు సాంబయ్య ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీ రాజ్ తన మిత్రుడు రిటైర్మెంట్ ఫంక్షన్ కు హాజరై తను భోజనం చేసిన తర్వాత ప్రక్కనే ఉన్న విస్తర్ల లో వదిలి వేసిన ఆహారం పదార్థాలు చూసి చాలా భావోద్రేకానికి లోనై మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలతో వ్యవసాయ చేస్తుటారు, పండించిన పంటకు అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరగడం పంట పండించి ధాన్యం రాశులుగా పోసిన టైం లో ఆకాల వర్షభావంతో ధాన్యం తడవడం, వర్షానికి కొట్టుక పోవడం వంటి బాధలు పడుతూ ఉంటారు. భారత దేశానికి రైతే రాజుగా, దేశానికే వెన్నుముకగా నిలుస్తూ తనవంతు బాధ్యతగా దేశానికి అన్నం పెడుతున్నాడని అన్నారు. దేశంలో అతి తక్కువ ధరలకు ఆహారం ఎక్కడ ఉంటుందో ఊహించగలరా అని ప్రశ్నించారు. మన పార్లమెంట్ క్యాంటీన్లో మాత్రమే చాలా తక్కువ ధరలకు ఆహార పదార్థాలు దొరుకుతయాని, అదే మనం త్రాగే కాపీ. టి. ఒక్క రూపాయి మాత్రమే, మనం తినే చపాతీ ఒక్క రూపాయి, మధ్యన్నా భోజనం కేవలం రూ.2లు, చికెన్ కర్రీ. రూ 24=50.పైసలు, చేప కర్రి. రూ.13లు, మాత్రమే బిర్యానీ కేవలం రూ.8లు ఇలా అన్ని రకాల ఆహారం రాష్ట్రాల వారిగా అందరికి అందుబాటులో ఉండే ప్రదేశం కేవలం మన పార్లమెంట్ లో ఎక్కడ లేని విధముగా అతి తక్కువ ధరలకే లభ్యమౌతాయి. కాగా పార్లమెంట్ సభ్యులకు జీతం సుమారుగా 1 లక్ష 20 వేలు నుండి రు 3.50లక్షల వరకు ఉంటుంది. వారు బ్రతికినంత కాలం ఎన్ని పదవులు పొందితే అన్ని రకాల పింఛన్లు పొందే అవకాశం ఈ పేదవారికి ఉంటుంది, ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ విషయం సమాచార హక్కు చట్టం ఫలితంగా పొందిన దాని ప్రకారం వివరించారు అదే .
కనీసం 20 ఏళ్ల సర్వీసులో ఉండాల్సిన మిగిలిన ప్రభుత్వో ఉద్యోగులతో పోలిస్తే రాజకీయ నాయకులకు ఒక పదవీ కాలానికి జీవిత కాలపు పెన్షన్ ఇవ్వడం తీవ్ర అన్యాయం. దీంతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గండి పడుతోంది. 20 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ కాలం మిలిటరీలో సేవలందిస్తున్న వారికి, మన స్వేచ్ఛను కాపాడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ రిటైర్‌మెంట్ వేతనంలో కేవలం 50% మాత్రమే పొందుతున్నారు అదే సురక్షిత పరిమితుల్లో తమ రాజకీయ పదవులను కలిగి ఉన్న రాజకీయ నాయకులు, కేవలం 5 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత పదవీ విరమణపై జీవితకాలం పెన్షన్లు పొందుతున్నారు ఇది ఎంతవరకు కరరెక్టు అని విచారం వ్యక్తం చేశారు అదే విధంగా మన పౌరులు కూడా విచిత్రమైన మనో భావాలతో ప్రవర్తిస్తున్నారు ఏదైనా ఫంక్షన్ కు వెల్తే మనం తినే ఆహారం ఎంత కావాలో అంతే తినాలని, విస్తరిలో వదలివేసిన అన్నం చూడండి అదే మన ఇంట్లో అల చేస్తామా ఒక్కసారి ఆలోచించండని ఇస్తర్లలో వదిలేసినా ఆహారాన్ని చూపిస్తు ఆవేదనన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంకల్పించినా సన్న బియ్యం అందరికీ అందే విధముగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

9
366 views