
కుబీర్ గ్రామంలో అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతోత్సవాలు-
ఈ రోజు నిర్మల్ జిల్లాలోని కుబీర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కారణజన్ముడని, కలియుగ పురుషుడని, కులమత భేదాలు లేకుండా, అందరూ సమానమే అని భావించి రాజ్యాంగాన్ని రాశారని గుర్తు చేశారు. "శోధించు-సమీకరించు-పోరాడు అని మూడు అంశాలపై మనము పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం పట్ల, మనకు కలిగి ఉన్న హక్కులను తెలుసుకొని సమాజంలో కులమత తేడాలు లేకుండా నవభారత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఏరోజైతే ఒక వ్యక్తి ఆత్మ న్యూనత, ఆత్మాభిమానం చంపుకోకుండా సమాజంలో తిరగ గలుగుతాడో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని, అంటరానితనం, కుల బహిష్కరణలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐటి ప్రకాష్, మాజీ ఎంపీపీ బోయిడి విట్టల్, మాజీ సర్పంచ్ మీరా విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందూర్ సంతోష్,నాయకులు ఏషాల దత్తాత్రి,బొప్ప నాగలింగం,బషీర్,జావిద్ ఖాన్,ఏక్బాలుద్దీన్,రాహుఫ్,
గోరేఖర్ సంతోష్,అలికే దత్తాత్రి,ఎన్నిల నాగేందర్, సూది రాజన్న,మహిళలు,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కస్తూరే రాహుల్, ఉపాధ్యక్షులు నాగోరావు,కార్యవర్గ సభ్యులు, మహిళలు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు