జగన్ను కలవాలంటూ ఏడుపు.. దగ్గరకు తీసుకోగానే ముద్దుపెట్టిన చిన్నారి.. క్యా సీన్ హై!
కిడ్నా్ప్ ఆరోపణల వ్యవహారంలో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీతో వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. ఆయనతో అరగంట పాటు భేటీ అయ్యారు. అయితే వైఎస్ జగన్ను చూసేందుకు విజయవాడ సబ్ జైలు వద్దకు జనం భారీగా తరలివచ్చారు. స్థానికులు, వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. ఈ క్రమంలోనే ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైఎస్ జగన్ను కలవాలంటూ ఓ చిన్నారి భోరున విలపించింది. అన్నా ప్లీజ్ అన్నా అంటూ జగన్ను కలవాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఈ విషయం గమనించిన వైఎస్ జగన్.. వెంటనే స్పందించారు. ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టారు. జగన్ను కలిశాననే ఆనందంలో ఆ పాప కూడా జగన్ నుదుటిపై ముద్దు పెట్టింది. అనంతరం వైఎస్ జగన్తో కలిసి సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.