logo

AiMA MEDiA-ఎస్ వి కోటేశ్వరరావు విజయవాడ

*విజయవాడ వరద బాధితులకు బాసటగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

*శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గళ్ళా రామ చంద్రరావు సహకారంతో అన్నార్తులకు భారీగా భోజనాలు పంపిణి*

*వరద సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొననున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి & మంత్రి శ్రీ నారా లోకేష్ పిలుపు మేరకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి విజయవాడ వరద బాధితులకు శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గళ్ళా రామ చంద్రరావు సహకారంతో అన్నార్తులకు 10,000 భోజన ప్యాకెట్లు 20000 వాటర్ బాటిళ్ల వాహనాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పచ్చ జెండా ఊపి పంపారు. ఈ సందర్భముగా గళ్ళా మాధవి మాట్లాడుతూ.... అకాల వరద భీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవటం, సుమారుగా 1,2 లక్షల మంది వరదల్లో ఉండటం బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని, విపత్తుల సమయంలో ప్రజలకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీయేనని, సమర్దుడయిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గత 2రోజుల నుండి విజయవాడలోనే ఉంటూ సహయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారన్నారని ప్రజలు కంగారుపడవద్దని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి & మంత్రి శ్రీ నారా లోకేష్ పిలుపుతో టీడీపీ,జనసేన,బీజేపీ కార్యకర్తలు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని,గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి తెలుగుయువత రావిపాటి సాయి కృష్ణ నేతృత్వంలో 50మంది యువకులు వాలంటీర్లుగా సేవలనందించారున్నారని, తానూ కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.అడిగిన వెంటనే శ్రీ భ్రమర ట్రస్ట్ ద్వారా 10,000 భోజనాలు అందజేసిన గళ్ళ రామ చంద్రరావుకు , 20,000 వాటర్ బాటిళ్లను అందజేసిన ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ వారికి ఎమ్మెల్యే మాధవి ధన్యవాదాలు తెలిపారు.

225
5406 views