logo

మార్బుల్ పలకల మధ్యలో పడి వ్యక్తి దుర్మరణం


రాజాం:

విజయనగరం జిల్లా, రాజాంలో విషాదం చోటు చేసుకుంది గృహ నిర్మాణానికి సంబంధించి మార్బుల్ పలకలను లగేజ్ వ్యాన్ లో తరలిస్తుండగా అదుపుతప్పి వాహనంలోని మార్బుల్ పలకలు అదే వాహనంలో ఉన్న యువకుడు పై పడడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు దీంతో హుటా హుటిన రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి కొండంపేట గ్రామానికి చెందిన నందమూడి శశి సంవత్సర క్రితమే పెళ్లి చేసుకొని ఆరు నెలల క్రితం పాప పుట్టడంతో తండ్రిగా ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్నాడు అన్న సమయంలో ఇప్పుడు ఈ ఘటనతో గ్రామంలో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది

54
4768 views