logo

పిట్లంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసిన అధ్యక్షులు లోక శ్రీనివాస్..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి,

కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలోని గురువారం పిట్లం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లోక శ్రీనివాస్ ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పిట్లం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేసీ ఆయన మాట్లాడుతూ.. ముందుగా భారతదేశ సోదర సోదరీమణులు ప్రజాప్రతినిధులు అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. అనేక మంది అమర వీరుల త్యాగఫలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం. సమరయోధుల పోరాట బలం దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచంలోనే సంపన్న దేశంగా ఎదగాలని, అన్ని వర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమంలో ముందుండాలని ఆరోజు పంచవర్ష ప్రణాళికలను మొదలుపెట్టి భారతదేశ మొట్టమొదటి ప్రధాన మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ కన్న కలలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లక్ష్మణ్ జనరల్ సెక్రెటరీ అంజాద్ కోషదికారి ఎండీ హన్ను, సలహాదారులు భుమన్న, వడ్ల రవి, సభ్యులు సాక్షి రిపోర్టర్ బాబా, నవీన్, సాయిబాబా, పండరి పవర్, మునిర్, గైని బాల్ రాజ్, సాయులు, గ్యార అంజి, తదితరులు పాల్గొన్నారు.

29
4505 views