కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి
రూ.5 కోట్లు ప్రకటించిన గౌతం అదానీ
ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్లో కొండచరియలు విరిగి ఘోరమైన ప్రాణనష్టం వాటిల్లడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.