logo

రాష్ట్రంలోనే అత్యధికంగా విజయనగరం జిల్లాలో


ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలు
మండిపోతున్నాయి. తుమ్మికాపల్లిలో బుధవారం
45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది రాష్ట్రంలోనే
అత్యధికం. నేడు కూడా ఉమ్మడి జిల్లాలో తీవ్ర
వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ
సంస్థ అంచనా వేసింది. విజయనగరంలో 23,
పార్వతీపురం మన్యం జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర
వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా
ఉండాలని సూచించింది.

0
0 views