logo

విజయనగరంలో వ్యక్తి మృతి



విజయనగరం కలెక్టరేట్ సమీపంలోని ఎస్. కోట వెళ్లే
రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గురువారం
ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు భిక్షాటన
చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిగా స్థానికులు
గుర్తించారు. ఈరోజు తెల్లవారు జామున రోడ్డు
దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి
చెంది ఉంటాడని అనుమానం వ్యక్తి చేశారు. ఈ మేరకు
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

0
0 views