logo

వైసిపి అభ్యర్థి డాక్టర్ రాజేష్ నామినేషన్ తో రాజాం రోడ్లన్నీ జన సముద్రం

*అట్టహాసంగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజేష్ నామినేషన్*

*మండుటెండను సైతం లెక్కచేయని వైసీపీ అభిమానులు*

*స్వచ్ఛందంగా వచ్చిన వైసిపి అభిమానులు*

విజయనగరం జిల్లా. రాజాం.

రాజాం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి డాక్టర్ తలే. రాజేష్ బుధవారం నామనేషన్ వేశారు. స్థానిక శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారు ఆలయం లో డాక్టర్ దంపతులు పూజలు చేశారు.అనంతరం అమ్మవారు ఆలయం నుండి ప్రధాన రహదారి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికలు అధికారికి రాజేష్ నామనేషన్ పత్రం అందజేశారు. కాగా వైసీపీ ర్యాలీ లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సుమారు 35 వేల మంది ర్యాలీ లో పాల్గొనట్టు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీ బెల్లనా. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస. విక్రాంత్, నియోజకవర్గం పరిశీలికులు పులి రాజు, జడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు. జగన్ మోహన్ రావు తో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, నియోజకవర్గం లోని పార్టీ నాయకులు పార్టీ అభిమానులు కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు...

61
5839 views