బీజేపీ నెల్లూరు జిల్లా కార్యవర్గసభ్యుడుగా కైలాసం శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి, ఇందుకూరుపేట మండలం కొత్తూరు బీజేపీ నాయకుడు కైలాసం శ్రీనివాసులు రెడ్డిని బీజేపీ నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యుడుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. నేడు జిల్లా బిజెపి కార్యాలయంలో శ్రీనివాసులురెడ్డికి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి ఇండ్ల రాఘవేంద్ర, బీజేపీ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి పరుశురాం, రాష్ట్ర మత్సకార సెల్ కో - కన్వీనర్ అంగీరు జనార్దన్, మత్సకార సెల్ జిల్లా కన్వీనర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.