logo

*జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం* *ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరం* *జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్*

*శ్రీకాకుళం, మార్చి 16, : జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్  స్పష్టం చేశారు. ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఎస్ పి జి ఆర్ రాధికతో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికలు నిభందనావలి అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ దేశంలో లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా, మే 13న ఎన్నికలు జరిగి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జిల్లాకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఆయన వివరిస్తూ జిల్లాలో 18,63520  మంది ఓటర్లు ఉండగా వారిలో 9,23,498 మంది పురుషులు, 9,39,891 స్త్రీల ఓటర్లు ఉన్నారన్నారు. అదేవిధంగా 131 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు.
జిల్లాలోని 2357 పోలింగ్  పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, ఓటర్ల సౌకర్యార్థం ఆయా పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, టాయిలెట్లు, ర్యాంపుల నిర్మాణం వంటి అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు చెప్పారు.
అదేవిధంగా 85 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం కన్న ఎక్కువ అంగవైకల్యం ఉన్న విభిన్న ప్రతిభావంతులకు హోం ఓటింగ్ ద్వారా  సౌకర్యం కోరుకుంటే కల్పిస్తామన్నారు, ఇది ఐచ్చికమని పోలింగ్ కేంద్రంలో ఓట్ వేయడమే ప్రాధాన్యం అని తెలిపారు. అయితే అభ్యర్థుల నామినేషన్ల ముందు రోజు వరకు కూడా అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం జరుగుతుందన్నారు.ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు, సందేహాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదన్నారు.
*కంప్లైంట్ మానేజ్మెంట్ సిస్టం*
*ఈ విభాగంలో ప్రజల నుండి ఫిర్యాదులు
స్వకరణకు
*1)టోల్ ఫ్రీ నెంబర్ 18004256625*
*2)1950 హెల్ప్ లైన్* (ఉదయం 10.00 నుండి సాయంత్రం 05.00 వరకు)
*3) డిసిసి ఫోన్ నంబర్స్ 08942-240606 / 08942 - 240589 / 08942 - 295084.
Email: complaintcell9@gmail.com*
*5) నేషనల్ గ్రీవన్స్ సర్వీస్ పోర్టల్,*
*6) సి - విజిల్ ద్వారా వచ్చే ఎన్నికల ఫిర్యాదులు*

13
1413 views
3 comment  
  • Bagadi Sreerama Murthy

    స‌మాజానికి మేల్కొపేది జ‌ర్న‌లిస్టులే - శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌ - అట్ట‌హాసంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీడియా ఫెడ‌రేష‌న్ జ‌ర్న‌లిస్టు జిల్లా మ‌హాస‌భ‌లు (శ్రీ‌కాకుళం) ప్ర‌జ‌లను అన్ని రంగాల్లో చైత‌న్యం చేస్తూ స‌మాజాన్ని మేల్కొపేది జ‌ర్న‌లిస్టులేన‌ని శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే గొండు శంక‌ర్ అన్నారు. న‌గ‌రంలోని అంబేద్క‌ర్ జంక్షన్ రెవెన్యూ అతిథి గృహంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీడియా ఫెడ‌రేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌ర్న‌లిస్ట్ జిల్లా మ‌హాస‌భ‌ల‌ను ఆదివారం అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టులంతా ఐక్య‌మ‌త్యంగా ఉంటూ వారి హ‌క్కుల‌ను సాధించుకోవాల‌ని తెలిపారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి చేర‌వేయ‌డంలో జ‌ర్న‌లిస్ట‌ల పాత్ర కీల‌క‌మైన‌ద‌న్నారు. స‌మాజంలో న్యాయ‌వ్య‌వ‌స్థ‌, రాజ‌కీయాలు, ప్ర‌జ‌లు, జర్న‌లిజం నాలుగు స్తంభాల‌ని, జ‌ర్న‌లిజం అంటే ప్ర‌జ‌ల్లోనూ, అధికారుల్లోనూ ఎంతో గౌర‌వం ఉంద‌ని తెలిపారు. ఈ వృత్తికి మ‌రింత గౌర‌వం తెచ్చేలా జ‌ర్న‌లిస్టులు న‌డుచుకోవాల‌ని చెప్పారు. జర్నలిజం గౌరవంగా, పవిత్రంగా భావించబడే ఒక రంగం అని తెలిపారు. ఇది సమాజానికి సమాచారాన్ని అందించే ఒక బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, జర్నలిజం సమాజంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంద‌ని, ప్రజాస్వామ్యానికి జ‌ర్న‌లిజం అవసరం అని అన్నారు. జర్నలిజం సమాజానికి సమాచారం అందించడం ద్వారా ప్రజలను అవగాహన కలిగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తుంద‌ని తెలిపారు. ఇది రాజకీయాలను పర్యవేక్షిస్తుంద‌ని, ప్రజలకు సమాచారం అందించడం ద్వారా అవినీతిని నిరోధిస్తుంద‌ని, జర్నలిజం ఒక ముఖ్యమైన బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, దీనిని గౌరవించవలసిన అవసరం ఉంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మీడియా ప్రతినిధులు కూట‌మి పార్టీల నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • Bagadi Sreerama Murthy

    *కృషి, పట్టుదల ఉంటే - అవకాశాలు మన వెంటే* *శాసన సభ్యులు గొండు శంకర్* *పురుషుల డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా* *20 ప్రముఖ కంపెనీలు..1022 ఉద్యోగాలు* శ్రీకాకుళం, ఏప్రిల్ 27 : కృషి, పట్టుదల ఉంటే ఉద్యోగ అవకాశాలు మన వెంటే వస్తాయని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు. యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ఆదివారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కణితి శ్రీరాములు అధ్యక్షత వహించారు. ఈ జాబ్ మేళా కి ముఖ్య అతిదిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమారు 20 ప్రైవేట్ కంపెనీలు 1022 ఉద్యోగాల భర్తీ చేయనున్నాయి. ఈ సందర్భంగా శాసన సభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజక వర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయానా శాఖా మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచెన్నాయుడు యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారని వివరించారు. ఇప్పటికి వరకూ 2,789 అభ్యర్థులు తమ పేర్లనువ్వు నమోదు చేసుకున్నారని తెలిపారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి బుడగట్ల పాలెంలో జరిగిన సభలో హామీ ఇచ్చారన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తే మన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులా గొప్ప విజయం సాధించడం సాధ్యమౌతుందని, యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా విజయవంతం అవుతుందన్నారు. పని చేసే ఉద్యోగంలో కూడా యువతీ, యువకులు బాధ్యతతో, అంతఃకరణ శుద్ధితో పని చేసి, సంస్థకు, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, తపన, లక్ష్యం ఉండాలని ఉద్యోగం చిన్నదా, పెద్దదా అనే ఆలోచన కంటే ముందు జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం ఉండాలన్నారు. కొంత కాలం కష్టపడితే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. సమాజాన్ని తెలుసుకునేందుకు ఒక అడుగు బయటపెట్టి బాహ్య ప్రపంచాన్ని చూస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారని, అందరూ కూడా ఈ జాబ్ మేళాలని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. మెగా జాబ్ మేళా నిర్వహణకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన శాసన సభ్యులు గొండు శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల నిర్మాణానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారని, ఇటువంటి చర్యలకు అందరూ ఖండించి, పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. షిప్ భవన, ఫిష్ లేండింగ్ నిర్మాణానికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందన్నారు, ఈ మెగా జాబ్ మేళాలో జిల్లా తెలుగుయువత అధ్యక్షులు దాసునాయుడు, టిడిపి పట్టణ అధ్యక్షులు మాధవరపు వెంకటేష్, సీనియర్ నాయకులు రమణ మాదిగ, టిడిపి బిసి సెల్ పట్టణ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, జిల్లా ఉపాధి అధికారిణి కె. సుధ, జిల్లా పౌర సంబంధాల అధికారి కె. బాల మాన్ సింగ్, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. *కృషి, పట్టుదల ఉంటే - అవకాశాలు మన వెంటే* *శాసన సభ్యులు గొండు శంకర్* *పురుషుల డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా* *20 ప్రముఖ కంపెనీలు..1022 ఉద్యోగాలు* శ్రీకాకుళం, ఏప్రిల్ 27 : కృషి, పట్టుదల ఉంటే ఉద్యోగ అవకాశాలు మన వెంటే వస్తాయని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు. యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ఆదివారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కణితి శ్రీరాములు అధ్యక్షత వహించారు. ఈ జాబ్ మేళా కి ముఖ్య అతిదిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమారు 20 ప్రైవేట్ కంపెనీలు 1022 ఉద్యోగాల భర్తీ చేయనున్నాయి. ఈ సందర్భంగా శాసన సభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజక వర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయానా శాఖా మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచెన్నాయుడు యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారని వివరించారు. ఇప్పటికి వరకూ 2,789 అభ్యర్థులు తమ పేర్లనువ్వు నమోదు చేసుకున్నారని తెలిపారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి బుడగట్ల పాలెంలో జరిగిన సభలో హామీ ఇచ్చారన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తే మన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులా గొప్ప విజయం సాధించడం సాధ్యమౌతుందని, యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా విజయవంతం అవుతుందన్నారు. పని చేసే ఉద్యోగంలో కూడా యువతీ, యువకులు బాధ్యతతో, అంతఃకరణ శుద్ధితో పని చేసి, సంస్థకు, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, తపన, లక్ష్యం ఉండాలని ఉద్యోగం చిన్నదా, పెద్దదా అనే ఆలోచన కంటే ముందు జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం ఉండాలన్నారు. కొంత కాలం కష్టపడితే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. సమాజాన్ని తెలుసుకునేందుకు ఒక అడుగు బయటపెట్టి బాహ్య ప్రపంచాన్ని చూస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారని, అందరూ కూడా ఈ జాబ్ మేళాలని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. మెగా జాబ్ మేళా నిర్వహణకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన శాసన సభ్యులు గొండు శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల నిర్మాణానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారని, ఇటువంటి చర్యలకు అందరూ ఖండించి, పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. షిప్ భవన, ఫిష్ లేండింగ్ నిర్మాణానికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందన్నారు, ఈ మెగా జాబ్ మేళాలో జిల్లా తెలుగుయువత అధ్యక్షులు దాసునాయుడు, టిడిపి పట్టణ అధ్యక్షులు మాధవరపు వెంకటేష్, సీనియర్ నాయకులు రమణ మాదిగ, టిడిపి బిసి సెల్ పట్టణ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, జిల్లా ఉపాధి అధికారిణి కె. సుధ, జిల్లా పౌర సంబంధాల అధికారి కె. బాల మాన్ సింగ్, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • Bagadi Sreerama Murthy

    *సింహాచలం చందనోత్సవానికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు!* ఈ నెల 30వ తేదీ నాడు సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్ నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి, ఏ.విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన అధికారులతో సమావేశమై, ఈ ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శ్రీకాకుళం బస్ స్టేషన్ నుండి రణస్థలం, నాతవలస, విజయనగరం, పద్మనాభం, సొంట్యాం మీదుగా అడవివరం & రణస్థలం, తగరపువలస, ఆనందపురం, సొంట్యాం మీదుగా అడవివరం వరకు ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. అడివివరం గోశాల నుంచి కొండపైకి 13 సిటీ బస్సులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిపో మేనేజర్లు, ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.