logo

నంద్యాల జిల్లా: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

నంద్యాల జిల్లా: ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు ఉపాధి కార్యాలయంలో డిసెంబర్ 5వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగులకు జాబు మేళ నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి తెలిపారు. అపోలో ఫార్మసిస్ లిమిటెడ్ కంపెనీలో ఫార్మసీస్ లో 20, రిటైల్ ట్రైనీ అసోసియేట్ లో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు. అభ్యర్థులు అర్హతకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు మరియు పాస్ ఫొటోస్ తీసుకొని రావాలని కోరారు. ఆసక్తిగల నిరుద్యోగులు www.ncs.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.

9
3670 views