logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Telangana state 2003 election campaign

*మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాలి*

గోదావరిఖని-: దుర్గ నగర్ లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ex వక్ఫ్ బోర్డు చైర్మన్, కాజీపేట దర్గా పీఠాధిపతి జనాబ్ ఖుసృ పాషా సాహబ్ , కర్ణాటక కేబినెట్ మినిస్టర్ ఎమ్మెల్యే B Z జమీర్ అహ్మద్ ఖాన్ sahab, మహరాష్ట్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మొహమ్మద్ అబ్దుల్ అజీజ్ గారు,రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు
మైనార్టీ నాయకులు ఉన్నారు

ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీలకు 4% రిజర్వేషన్ తీసుకోచ్చాము.. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 12% రిజర్వేషన్ ఇస్తామని కెసిఆర్ మోసం చేసాడు అని ఆరోపించారు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
100 రోజుల్లో ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెటిలను అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ బిజెపి రెండు పార్టీలు ఒక్కటే అని వారికి బుద్ది చెప్పాలని అన్నారు.

రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ...
ఈ ప్రాంత బిడ్డను, నన్ను గెలిపించాలని మైనారిటీ కుటుంబ సభ్యులు అల్లా దేవుడికి మొక్కలని అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గోన్నారు..

153
1 comment
7648 views

Comment
  • Gantala Mohan Rao

    కాంగ్రెస్ దే విజయం సార్