logo

*బీ అలెర్ట్.. మరోసారి వడగళ్ల వాన.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక* *పల్నాడు జిల్లా రైతులు జర జాగ్రత్తలు తీసుకోండ

*బీ అలెర్ట్.. మరోసారి వడగళ్ల వాన.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక*

*పల్నాడు జిల్లా రైతులు జర జాగ్రత్తలు తీసుకోండి పొలాల లో ఉన్న పంట కు*

*విద్యుత్ శాఖ ఉద్యోగులు.. అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచన*

శివ శంకర్. చలువాది

ఆంధ్ర,తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ వచ్చింది. అయితే మరోసారి పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ ఝార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వివరించింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు లేదా ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. కృష్ణా, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, ఏలూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో గురువారం ఓ మోస్తారు వర్షం కురిసింది.

కాగా.. అకాల వర్షంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతుల నష్టపోయారు. ఏపీ సీఎం జగన్ అధికారులుతో రివ్యూ మీటింగ్ నిర్వహించి.. ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర పంట నష్టం వాటిల్లిన పలు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి.. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేల చొప్పున పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

1
0 views