భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ఎమ్మార్వో కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ఎమ్మార్వో కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. జూన్ 2 సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు సేవాలాల్ సేన రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ధరావత్ కృష్ణా నాయక్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.