logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తల్లికి వందనం నగదు.. ఏ ఖాతాలో జమవుతుందంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద అందించే నగదు, తల్లి ఆధార్‌కు NPCI లింక్‌ అయిన బ్యాంకు ఖాతాలోనే జమ అవుతుంది. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నా, NPCI యాక్టివ్‌గా ఉన్న ఖాతాలోకే డబ్బు జమ కానుంది.
NPCI లింక్‌ ఏ ఖాతాకు ఉందో తెలుసుకోవాలంటే:
🔹 UIDAI వెబ్‌సైట్‌లో: ఆధార్‌తో లాగిన్ అయి Bank Seeding Statusలో చెక్ చేసుకోవచ్చు.
🔹 NPCI పోర్టల్‌లో: ఏ బ్యాంకు లింక్ అయిందో చూడటంతో పాటు అవసరమైతే మార్చుకోవచ్చు.
🔹 గ్రామ/వార్డు సచివాలయంలో: నేరుగా వివరాలు తెలుసుకోవచ్చు.
🔹 బ్యాంకు శాఖలో: ఖాతా NPCI స్టేటస్‌ను చెక్ చేయించుకోవచ్చు.
📌 అక్కడ Active అని కనిపిస్తే ఆ ఖాతాలోనే నగదు జమ అవుతుంది.
📌 Inactive ఉంటే బ్యాంకు లేదా NPCI ద్వారా యాక్టివ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

30
1119 views

Comment