"పంచ్ ప్రభాకర్ రెడ్డి" పై "కోలగట్ల" పంచ్
ఆర్యవైశ్య జాతిపై అనుచిత వాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్ రెడ్డి పై ఆర్యవైశ్య జాతి ప్రజలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు...ఎక్కడో లండన్ లో ఉంటూ ఆర్య వైశ్య జాతి వాన పాముకి ఎక్కువ బురద పాము కు తక్కువ అంటూ మాజీ మంత్రి తుంబలం గూటి వెంకటేష్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ....యావత్ ఆర్య వైశ్య కులం మనోభావాలు దెబ్బతినేలా జాతి పై విమర్శలు చెయ్యడం పై భారత దేశ వ్యాప్తంగా భగ్గుమంటున్నారు.ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (వామ్) పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు.దాన ధర్మాలకు,మంచి ప్రవర్తనకు మారుపేరు వైశ్య కులం అన్నారు.ఎక్కడో లండన్ లో ఉండి పిచ్చి ప్రేలాపనలు,సైకోలా శరీర అవయవాల పై కామెంట్స్ చెయ్యడం, మీసం... రోషం... అంటూ కులాల మధ్య అగ్గి పెట్టడం సరికాదని....దమ్ము,దైర్యం,రోషం,పౌరుషం ఉంటే ఇండియాకి, ఆంధ్ర ప్రదేశ్ లో అడుగుపెట్టి అప్పుడు మగాడిలా ఫేస్ టూ ఫేస్ మాట్లాడాలని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమం లో పసుమర్తి నరేష్ కుమార్,అరిశెట్టి అనిల్ కుమార్,సిటీ కేబుల్ నాగోలు తాతాజీ పాల్గొన్నారు.