సరస్వతి అంత్య పుష్కరాల్లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొనడం
జయశంకర్ భూపాలపల్లి. కాలేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాలలో భాగంగా గురువారం ఎనిమిదవ రోజు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు త్రివేణి సంగమం వద్ద నిర్వహించిన సరస్వతి నవల నవరత్న మాలా హారతిని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి, దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మ, ఈవో మహేష్ తో కలిసి వీక్షించారు. మంత్రి శ్రీధర్ బాబు కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ప్రాంగణంలో ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు ప్రశంసలు తెలిపారు మరియు బ్రహ్మశ్రీ స్వరూపానంద స్వామి గారికి ధన్యవాదాలు తెలిపారు. వారు ఈ ప్రాంత వాసులు మరియు తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు.విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ కార్యక్రమాన్ని హిమాలయాల్లో ఉన్నట్టుగా అభివర్ణించారు మరియు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లను కొనియాడారు. పూర్వకాలంలో గంగా స్నానం చేసినట్లు గోదావరి స్నానం చేయాలని వేదాలు సూచిస్తున్నాయని, సరస్వతి నది త్రివేణి సంగమంతో ఈ అంత్య పుష్కరాలు గొప్పగా ప్రారంభమైందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వేడుకలను గొప్పగా నిర్వహించారని స్వామీజీ అభిప్రాయపడ్డారు. కాలేశ్వరం దేవాలయ అభివృద్ధి, హారతుల అలంకరణకు ప్రశంసలు తెలిపారు. దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి మరియు జిల్లా యంత్రాంగం యొక్క కృషి గొప్ప ఫలితమని పేర్కొన్నారు. పరమశివుని మహా ప్రదోష త్యాగం సందర్భంగా ఈ హారతి కార్యక్రమం ఎంతో ముఖ్యమైనదని, పుష్కర స్నానం అదృష్టం కలిగిస్తుందని స్వామీజీ తెలిపారు. చివరగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, భక్తి భావాలు పెరిగి యువత పౌరులుగా ఎదగాలని ఆశీర్వదించారు.