నిజామాబాద్ ములమలుపులో రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి వెనుక ఉన్న ప్రమాదకర ములమలుపు రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు హెచ్చరికలు అందించేలా భద్రతా బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది.
చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ K. రవీందర్ సూచనలతో, మండల ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నేడు నిర్వహించారు. స్థానిక యువత, గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటైన భద్రతా బోర్డులను వారు అభినందించారు. CI రవీందర్ వాహనదారులకు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముక్యంగా ప్రశాంత్ రెడ్డి, కానిస్టేబుల్ జగన్, యూత్ లీడర్ చల్ల జితేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లంబ రాజు యాదవ్, శ్రీకాంత్ గౌడ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.