విజయనగరం లో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం...
విజయనగరం సిటీ లో మనసాస్ కళ్యాణ మండపం లో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ మీద విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సౌత్ జోన్ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, పెందుర్తి ఎమ్మెల్యే కంచికర్ల విజయబాబు, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాలూరు జనసేన పార్టీ నాయకులు జర్జాపు ఈశ్వరరావు సూరిబాబు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ జనసేన కౌన్సిలర్ ప్రతినిధి గుమ్మా నాగార్జున, నాలుగో వార్డ్ మాజీ కౌన్సిలర్ జి వరప్రసాద్, రెల్లి వీధి పెద్దలు నిమ్మకాయల విజయ్ కుమార్ పిల్లా మురళి, వార్డు మాజీ కౌన్సిలర్, పరశురాం విశాఖపట్నం పాల్గొని సౌత్ జోన్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో సాలూరు జనసేన నాయకులు సాలూరు నియోజకవర్గం వార్డ్ డి లిమిటేషన్ ప్రక్రియ పై చర్చ నిర్వహించారు.