సాలూరు టౌన్లో బిజెపి నేతల విజయోత్సవ సంబరాలు
సాలూరు టౌన్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ కార్యాలయంలో హేమా నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేయగా, స్వీట్లు పంచుకొని "జై బిజెపి", "జై నరేంద్ర మోదీ" అని నినాదాలు చేశారు.
నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ వి.హేమా నాయక్ దేశ వ్యాప్తంగా బీజేపీపై ప్రజల విశ్వాసం పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ హేమా నాయక్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వరరావు, ఆర్. లక్ష్మణరావు, వానపల్లి మురళీకృష్ణ, వంగకొండ అప్పలనాయుడు, పొట్ట శ్రీనివాసరావు, సముద్రాల సురేష్, పూసర్ల గోవిందరావు, నడుపూరు శేఖర్, బోరాడ సూరయ్య తదితరులు పాల్గొన్నారు.