logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విసిగిపోయిన తండ్రి

కుమారుడి కోరిక మేరకు ఆ తండ్రి బైక్ కొనిచ్చారు. దాన్ని ఆ కుమారుడు రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తుండడంతో ట్రాఫిక్ చలానాలు వస్తున్నాయి. దీంతో విసిగిపోయిన తండ్రి.. చివరకు వాహనాన్ని తగలబెట్టారు. విశాఖలోని పెందుర్తి జరిగిన ఈ ఘటనపై పోలీసుల కథనం.. వేపగుంట సమీప బంటాకాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో ఓ కుమారుడు కళాశాలకు వెళ్లొచ్చేందుకు బైక్ కావాలని పట్టుబట్టాడు. తప్పనిసరి పరిస్థితిలో తండ్రి ఏడాది కిందట వాహనం కొనుగోలు చేశారు. అది చేతికందిన తర్వాత ఆ అబ్బాయి తన స్నేహితులతో ఎక్కువగా తిరగడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన నడిపాడు. గతేడాది ఓ ప్రమాదం జరగ్గా.. ఆసుపత్రి ఖర్చుల కోసం తండ్రి రూ. లక్ష వరకు ఖర్చు చేశారు. తాజాగా మరోమారు ట్రిపుల్ రైడింగ్ కారణంగా జరిమానా పడడంతో తండ్రి అసహనం చెందారు. బైకు కొనివ్వడం వల్లే తన కుమారుడు ఇలా తయారయ్యాడని ఆగ్రహించి కాలనీకి దూరంగా వాహనాన్ని తీసుకెళ్లి తగలబెట్టారు.

1
66 views

Comment