వృత్తి నైపుణ్యాలు అవసరమే: హెచ్ఎం నాగేశ్వరరావు
విద్యార్ధులు చదువుతో పాటూ వృత్తి నైపుణ్యాలను అవసరమని అరకులోయ మండలం, రవ్వలగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం తెలగంజి నాగేశ్వరరావు మంగళవారం అన్నారు. ఆటోమోటివ్ వృత్తి విద్య ఇంటర్న్షిప్ పూర్తిచేసుకున్న విద్యార్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇంటర్న్షిప్ పూర్తిచేసుకున్న విద్యార్ధులకు ప్రభుత్వం అందించిన సర్టిఫికెట్స్, టీ షర్ట్, టూల్ కిట్స్ ను అందించినట్లు వొకేషనల్ టీచర్ జడ్డు చిరంజీవి నాయుడు తెలిపారు.