గ్రీన్ వరల్డ్ విజయవాడ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం
సాలూరు టౌన్, విజయవాడ నగరం, రాయగడ,విజయనగరం తదితర ప్రాంతాల లో గ్రీన్ వరల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.సమాజం కోసం తనవంతు సహాయం చేయడం కోసం సుమారు 8 ఏళ్లు గా గ్రీన్ వరల్డ్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రహి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.గ్రీన్ వరల్డ్ సభ్యులు సాలూరు లో గుమడాం రోడ్ లో శ్రీ అయ్యప్ప కార్ పార్కింగ్ అండ్ వాషింగ్, శ్రీ వెంకటేశ్వర పవర్ బ్రిక్స్ అధినేత, ప్రముఖ వ్యాపారస్తులు, టిడిపి నేత తేలికాపు ఉమా మహేశ్వర రావు మంగ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన సహకారం
తో విజయవాడ వన్ టౌన్ లో రొట్టెలు,పండ్లు,మజ్జిగ పంపిణీ చేశారు ఇంకా భవిషత్తు లో మరిన్ని సేవలు అందించే ప్రక్రియ లో ఉన్నామని తెలిపారు.