కడప నగరంలో నగర డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు భారీగా చేరికలు జరిగాయి.
కడప జిల్లా కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ భారీ చేరికలు
కడప నగరంలో నగర డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు భారీగా చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరియు నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మహమ్మద్ గౌస్ పీర్ మాట్లాడుతూ, కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతుందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారందరికీ ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు.