అంబరాన్నంటినగ్రామ దేవతమైసమ్మపండగ
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గ్రామ దేవత అయినటువంటి కొండ మైసమ్మ పండగ ఘనంగా వేడుకలు ముగిశాయి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మస్కూరి కాశీరాం మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం గ్రామంలో తొలి పండగ కొండ మైసమ్మ ఉత్సవాలు జరపడం రైతులకు అకాల వర్షాల ప్రభావం వల్ల రాళ్లు వాడి పంటలు నష్టం జరగకుండా గ్రామ రైతులకు రక్షణగా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని గ్రామంలో తొలి పండగ జరుపుకోవడానికి కారణమని ఆయన ప్రసంగించారు బైండ్ల పోచమ్మల పంబల పూజారులతో ఘనమైన ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.