రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్సి) కొత్త మెడికల్ అధికారిగ డా. జి. కుమారస్వామి
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట పిహెచ్సి వైద్యాధికారిగా డాక్టర్ కుమారస్వామి బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రోలుగుంట చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచడానికి తను కృషి చేస్తానని తెలిపారు. డాక్టర్ శ్రావణి ఎం పి హెచ్ ఈ ఓ గోవిందా, కృష్ణులు, సీనియర్ అసిస్టెంట్ ప్రసాదు, హెచ్ ఎస్ షాజహాన్ డాక్టర్ను సాదరంగా ఆహ్వానించి గౌరవించారు.