మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసిన తెలంగాణ ఉద్యమకారుడు మాచర్ల భద్రయ్య..
మల్కాజ్గిరి: మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ను తన నివాసంలో తెలంగాణ ఉద్యమకారుడు మాచర్ల భద్రయ్య కలిసి. 2007లో సర్వేనెంబర్ 57 ఎల్లమ్మ బండ లో MRPS ఆధ్వర్యంలో ఇండ్లు లేని పేద ప్రజలు అక్కడ గుడిసెలు వేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వం 57 మంది పైన ఇది ప్రభుత్వ భూమి అని కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటివరకు కూడా మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. అని మాచర్ల భద్రయ్య ఈటెల రాజేందర్ గారికి వివరించారు. 2013 నుండి కోర్టులో ఫైల్స్ మాయమయినందున మమ్మల్ని కోర్టుకు పిలవడం లేదు అని ఇట్టి విషయాన్ని. మరియు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ఈటెల రాజేందర్ గారు అసెంబ్లీలో 57 సర్వేనెంబర్ పై పలుమార్లు స్పందించిన తీరును భద్రయ్య గారు గుర్తు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గార్లు కలిసి ఇట్టి ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చిత్రీకరిస్తూ. అక్రమ కట్టడాలు చేపడుతున్నారు కావున దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈటెల రాజేందర్ ని కోరారు.