సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేకనికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కు స్వాగతం పలికిన మంత్రి తుమ్మల,ఎమ్మెల్యే తెల్లం, కలెక్టర్ అంకిత్
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** భద్రాచలం పట్టణం** మార్చి 28 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
భద్రాచలం, మార్చి 28:
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా భద్రాచలం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లకు సారపాక లోని ఐటిసి హెలిప్యాడ్ వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో బి రాహుల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మరియు అధికారులు అనధికారులు ప్రముఖులు తదితరులు ఘనస్వాగతం పలికారు.