ఇరాన్ వార్ ఎఫెక్ట్..
పెట్రోల్ వాయింపుడు మొదలైంది..!
జర్నలిస్టు : మాకోటి మహేష్
===================
ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా మనదేశంలో పెట్రోల్ రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే గ్యాస్ వినియోగదారులకు చుక్కలు పనపడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా యుద్ధం కారణంగా ప్రీమియం పెట్రోల్ (పవర్ పెట్రోల్) ధరల్ని పెంచుతూ హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్కు 2 రూపాయల నుంచి 2.35 వరకు ఈ పెంపు ఉండనున్నట్టు తెలుస్తోంది. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచే అమలు కానున్నాయి.