అరకు: హామీలు నెరవేర్చాలని వాలంటీర్ల యూనియన్ డిమాండ్
ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుత సీఎం చంద్రబాబు గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చి హామీని నెరవేర్చాలని అరకులోయ గ్రామ, వార్డు వాలంటీర్ల యూనియన్ డిమాండ్ చేసింది. గురువారం ఆ యూనియన్ నాయకులు సొమెలి ఆనంద్, బురిడీ బుచ్చన్న, స్వాబి రాజుబాబు, నగేష్ తదితరులు అరకులోయ లో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా గ్రామ వార్డు వాలంటీర్లుకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వాలంటీర్ల పైన ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే పోరుబాట తప్పదని హెచ్చరించారు.