ఉగాది మరియు రంజాన్ పండుగలు దైవం చూపిన మార్గాలలో జరుపుకోవాలీ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ గఫార్ తన 70 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ సోదరభావంతో మెలగాలని, ఉగాది మరియు రంజాన్ పండుగలు దైవం చూపిన మార్గాలలో ఐకమత్యంతో పండుగలు చేసుకోవాలని తన ఫ్లెక్సీ బోర్డును తన ఆటోలో అంటించుకుని ఊరురా తిరుగుతూ ప్రచారం చేయుచున్నాడు. షడ్రుచుల ఉగాది, ఆకలి దప్పుల దీక్షతో ఉన్న రంజాన్ ఉపవాసాలు మానవులందరినీ ఏకతాటిపై నడిపిస్తున్న మహోన్నతమైన రామబాణం లాంటి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఆటో రాజా తదితరులు పాల్గొన్నారు