తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు
జర్నలిస్ట్: ఆకుల గణేష్
ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని తాడిచెర్ల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఆదివారం సర్పంచ్ బండి స్వామి పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతలో వారి పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్మికులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.