ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి: అరకు ఎమ్మెల్యే రేగం
పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని ఆదివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. రేపటి నుండి ప్రారంభమయ్యే పది పరీక్షలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే లా కాకుండా పూర్వ ఉపాధ్యాయునిగా విద్యార్ధులకు కొన్ని సూచినలు చేశారు. పరీక్షా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్ష రాసేటప్పుడు ఆందోళన చెందకూడదని ఆయన తెలిపారు. విద్యార్ధులు పరీక్షలు బాగా రాసి, మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.