పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
జర్నలిస్ట్: ఆకుల గణేష్
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. కరిమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆర్డీఓ సుమా, శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.