కేయూ మాజీ వైస్ ఛాన్సలర్ లింగమూర్తి మృతి
జర్నలిస్ట్: ఆకుల గణేష్
కాకతీయ విశ్వవిద్యాలయం ఎకనమిక్స్ విభాగానికి చెందిన విశ్రాంత ఆచార్యులు, మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎన్. లింగమూర్తి (75) హనుమకొండలోని భీమారం వద్ద ఉన్న తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నవంబర్ 2007 నుండి నవంబర్ 2010 వరకు కాకతీయ విశ్వవిద్యాలయ 10వ వైస్ చాన్సలర్గా పనిచేశారు.