మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసిన డెల్టా కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు...
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 12/03/2026:
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు దివ్యాంగుల శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి డెల్టా కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డెల్టా కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ తరపున మంత్రివర్యులకు మెమొంటో మరియు భగవద్గీతను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అతి తక్కువ ధరలకు అందిస్తున్నందుకు డెల్టా కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులను అభినందించారు.