logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంటుంది :- పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే :-

కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంటుంది :-

పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే :-

నిర్మల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో డిసిసి , ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ :-

నిర్మల్ : నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ లో జరగగ , జిల్లా డిసిసి అధ్యక్షులు , ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు నూతన మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది . ఇటీవలే జరిగిన డిసిసి 10 రోజుల శిక్షణ కార్యక్రమంలో , కార్యక్తల ఎదుగుదల పార్టీ నాయకుల బాధ్యత అని కాంగ్రెస్ అగ్ర నాయకులు తెలిపారని , ప్రతి ఒక్కరిని కష్టపడుతున్న కాంగ్రెస్ నాయకులను కాపాడాల్సిన బాధ్యత అధ్యక్షులదే అని దిశ నిర్దేశం చేశారన్నారు . కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన , ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం , ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి చేరడం లేదని , మన పార్టీ మన కుటుంబం , కార్యకర్తలే పార్టీకి బలం , కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి పార్టీలో తగిన స్థానం ఉంటుంది , ఎవరు నిరాశ చెందద్దు , పార్టీ కోసం శ్రమించే వారిని కాపాడుకోవడం మా బాధ్యత . రానున్న ఎన్నికల్లో ప్రజల్లో ఉందాం , కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీహరి రావ్ గారు , ఇంద్రకరణ్ రెడ్డి గారు అనుబంధ సంఘ నాయకులు , నూతన కాన్సిలర్లు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment