అహోబిల మఠం అత్యున్నత అధికారి రామానుజన్ తమ పదవికి రాజీనామా చేయటానికి సిద్ధపడినట్టు డెడ్ లైన్.
నంద్యాల జిల్లా ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినటువంటి అహోబిలం మఠం అత్యున్నత అధికారిగా విధులు నిర్వహిస్తున్న రామానుజన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. వారు మాట్లాడుతూ
నేను ఉండను అంటే ఉండను అని
అహోబిల మఠం అత్యున్నత అధికారి రామానుజన్ 9వ తేది ఈవెనింగ్ లోపల రాజీనామా చేయటానికి సిద్ధపడ్డానని, అహోబిలం మఠం ప్రతినిధులతో తెలుపటంతో వారు
చివరికి నీ ఇష్టం అని బదులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. స్వేచ్ఛ లేకుండా ఉండలేననీ అన్ని ఇబ్బందులే ఎదురవుతున్నాయని గుడికి అన్యాయం చేయలేనని తెలిపారు.
`జనాస్త్రం`అహోబిల మఠం ప్రత్యేక అధికారిగా 3 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన రామానుజన్ రాజీనామా చేయడానికి సిద్ధం కాగా మధ్యవర్తులు చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదని తెలుస్తుంది వృత్తి లో ఉండి మేలు చేయలేనని అందువల్ల రాజీనామాకు సిద్ధం ఐనట్టు రామానుజన్ అనుచరులకు తెగేసి చెప్పి నట్టు తెలుస్తుంది. మొత్తం మీద రామానుజన్ రాజీనామా హాట్ టాపిక్ గా మారిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.