అరకు: పోస్టర్ మేకింగ్ పై విద్యార్ధులకు పోటీలు
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం విద్యార్ధులకు పోస్టర్ మేకింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ద్వారా సమాజంలో మహిళ పాత్ర పై విద్యార్ధులకు అవగాహణ కలుగుతుందని ప్రిన్సిపాల్ డా నాయక్ తెలిపారు. పోటీలలో 16 మంది పాల్గొన్నారని మహిళ సాధికారత సెల్ కన్వీనర్ పి సుందరి రాణి అన్నారు. ఎన్ఎస్ఎస్ పీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.