అరకు: ప్రధాన దేవాలయాల్లో జీసీసీ స్టాల్స్ ఏర్పాటుకు ప్రతిపాదించిన జీసీసీ చైర్మన్
టీటీడీ పరిదిలో జీసీసీ స్టాల్స్ ఏర్పాటుకు సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో జీసీసీ అరకు కాఫీ స్టాల్స్ ని రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఏర్పాటు చేయాలని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలో దేవాదయశాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ హరి జవహర్లాల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దేవాలయాలకు అవసరమైన పసుపుని జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు అట్లూరి నారాయణరావు పాల్గొన్నారు.