అంగన్వాడీ వర్కర్స&హెల్పర్స్ సమస్యలు పరిస్కారం చేయకపోతే సీఎం కార్యాలయం ముట్టడిస్తాం
నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ఆందోళన శుక్రవారం నాడు పలు సమస్యలపై గళం వినిపించారు. అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని,గ్రాడ్యూటీ ఇవ్వాలని, మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలని,అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట AITUC ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో AITUC నాయకులు ధనుంజయ్,మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న AITUC అనుబంధ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనీ తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు.