జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నాలుగు మండలాల నాయకులతో దిశానిర్దేశం
చోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఫిబ్రవరి 22 రావికమతం మండలంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, రోలుగుంట మండల అధ్యక్షుడు బలిసి మహారాజు, కన్వీనర్ లాలం నరసింహారావు, కో-కన్వీనర్ మహేశ్వరి రమణ, బుంగ కోటి, పరవాడ దొరబాబు తదితరులు, రోలుగుంట మండల పరిధిలోని 24 పంచాయతీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా కల్పించేలా, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే బీమా సౌకర్యాన్ని పార్టీ కల్పిస్తోంది. ఈ సందర్భంగా, ప్రతి కార్యకర్త తప్పకుండా సభ్యత్వం చేయించుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశం జనసేన పార్టీలో కార్యకర్తలలో అధిక ఉత్సాహాన్ని రేకెత్తించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడమే కాకుండా, పార్టీ క్షేత్ర స్థాయిలో మరింత శక్తివంతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.